చీకటి లోయలో కాకుల గుంపు
చిరాకు పడుతూనే ఉంది
చికాకు పెడుతూనే ఉంది..
నీ వల్ల కానే కాదంటూ,
నడక వీల్లేదంటూ.
బురద మడుగులో మొసళ్ల జంట,
పొదల్లో చేరిన తోడేళ్ళ మంద
నొసలు చిట్లిస్తున్నాయి
కన్నీళ్లతో నస పెడుతున్నాయి..
ముందుకెళ్లడం ముప్పేనంటూ,
క్షమించరాని తప్పేనంటూ …
ముందు నిలిచిన గమ్యమొక్కటే
రారమ్మని పిలుస్తోంది
భుజం తట్టి వెల్తురు పరుస్తోంది
మిత్రమా,
నీ యాత్ర నువ్వే చెయ్యాలంటూ..
నీ చరిత్ర నువ్వే రాయాలంటూ …
– డా. డి వి జి శంకరరావు, మాజీ ఎంపీ, 94408 36931