TSRTC: ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 22 ఎలక్ట్రిక్‌ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్‌ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వస్తున్న బస్సులని గ్రేటర్‌ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్‌ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. నగరంలోని అన్ని ప్రాంతాలకు నడుస్తాయి. బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో 33 కేవీ పవర్‌ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్‌ బస్సులు సమకూర్చుకుంటోంది.

➡️