ప్రపంచకప్ జూనియర్ హాకీ టోర్నీ ప్రపంచకప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత్కు ఓటమి తప్పలేదు. గ్రూప్ాసిలో ఉన్న భారత్ గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో పటిష్ట స్పెయిన్ చేతిలో ఓడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 1-4గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. స్పెయిన్ తరఫున కబ్రే వెబ్రెల్ 1, 41వ ని.లో రఫి 18, 50వ ని.లో రెండేసి గోల్స్ కొట్టారు. ఇక భారత్ తరఫున ఏకైక గోల్ను రోహిత్ రెండో అర్ధభాగంగా 33వ ని.లో చేశాడు. తొలి లీగ్ మ్యాచ్లో కొరియాపై 4ా2గోల్స్తో నెగ్గిన భారత్.. నేటి మ్యాచ్లో ఓటమితో గ్రూపాసిలో మూడోస్థానానికి పడిపోయింది. ఇక స్పెయిన్ జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలిచి 6పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. కొరియా 4-1గోల్స్తో కెనడాను చిత్తుచేసి రెండోస్థానానికి ఎగబాకింది. శనివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో భారతజట్టు కెనడాతో తలపడనుంది. మరో మ్యాచ్లో స్పెయిన్-కొరియాతో ఆడనుంది. ఆ మ్యాచ్లు ముగిసిన తర్వాత క్వార్టర్ఫైనల్ బెర్త్లు ఖరారు కానున్నాయి. ఇక గ్రూప్-డిలో పాకిస్తాన్ జట్టు 4-0తో న్యూజిలాండ్ను, నెదర్లాండ్స్ జట్టు 5-3తో బెల్జియంను చిత్తుచేశాయి.