‘ మరణమే శరణ్యం ‘ – వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి అన్నదాతల ఆందోళన

దేవరాపల్లి (అనకాపల్లి) : ‘ మా భూ సమస్యలను పరిష్కరించకపోతే మరణమే శరణ్యం ‘ అంటూ … అన్నదాతలు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళన చేశారు. బుధవారం ఉదయం దేవరాపల్లి మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ పై అనంతగిరి మండలం, పెద్ద గంగవరం గ్రామానికి చెందిన కొంతమంది అన్నదాతలు తమ భూ సమస్యలను పరిష్కరించకపోతే మరణమే శరణ్యం అంటూ ఈ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు. తమకు అధికార యంత్రాంగం న్యాయం చేయాలి అంటూ … డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ డి.నాగేంద్ర ఆ రైతులను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.

➡️