ప్రజాశక్తి – భట్టిప్రోలు : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖులు సిపిఎం ఆవిర్భావంలో ముఖ్యులు అయిన మాకినేని బసవపున్నయ్య 32వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం భట్టిప్రోలులోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు బసవపున్నయ్యకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం భట్టిప్రోలు మండల కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ మాట్లాడుతూ కలిగిన నాయకుడని సిపిఎంకి దిశా నిర్దేశం చేశారని అంతేకాక మతతత్వ ప్రమాదాన్ని ఆయన ఆనాడే పసిగట్టి పార్టీ శ్రేణులకు హెచ్చరిక చేశారని తెలిపారు. మరో మండల కమిటీ సభ్యులు జి నాగరాజు మాట్లాడుతూ సిపిఎం సభ్యులంతా మాకినేని బసవ పున్నయ్యను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని తెలిపారు. తోలుతా సిపిఎం సీనియర్ నాయకులు ఆకురాతి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు బట్టు నాగమల్లేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పప్పల అహరోను తదితరులు పాల్గొన్నారు.