చెట్టుకు వేలాడుతూ బాలికల మృతదేహాలు

Mar 1,2024 10:40 #Uttar Pradesh

యుపిలో మరో ఘోరం

సామూహిక అత్యాచారం చేశారు : కుటుంబ సభ్యుల ఫిర్యాదు

లక్నో : సామూహిక అత్యాచారానికి గురైనట్లు భావిస్తున్న ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి, ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఫిర్యాదు చేసింది. నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చెట్టుకు వేలాడుతున్న 16, 14 ఏళ్ల వయసున్న బాలికల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. కాంట్రాక్టర్‌ కుమారుడు, మేనల్లుడు బాలికలతో మద్యం తాగించి, అత్యాచారానికి పాల్పడ్డారని ఇటుక బట్టీలో పని చేసే బాలికల కుటుంబం ఆరోపించింది. దీనిని వీడియో తీయడంతో అవమానం తట్టుకోలేక ఇద్దరు బాలికలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లలో ఉన్న వీడియో క్లిప్స్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఇటుక బట్టీకి సుమారు 400 మీటర్ల దూరంలోని చెట్టుకు వేలాడుతూ బాలికల మతదేహాలు కనిపించాయని వెల్లడించారు.

➡️