నిఖిల్ వర్మ మృతదేహం లభ్యం

Dec 7,2023 12:53 #Tirupati
dead body found in mangalam

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళవారం తిరుపతి జిల్లాలోని మంగళం పరిధిలోని తిరుమల నగర్ పంచాయతి కేబిఆర్ నగర్ వద్ద వాగులో కొట్టుకుపోయిన నిఖిల్ వర్మ కొత్తదేహం లభ్యం అయింది. రెండు రోజులు తర్వాత నీటి ఉధృతి తగ్గడంతో బాలుడు కోసం వెతుకులాట కొనసాగించారు. కెబిఆర్ నగర్ పెద్ద కాలువలో బాలుడు మృతదేహం చిక్కుకుపోయింది. దీనిని గుర్తించిన స్థానికులు, రెస్క్యూ సిబ్బంది బాలుడు నిఖిల్ వర్మ మృతదేహాన్ని వెలికి తీశారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తండ్రి ఆనంద్, తల్లి చిట్టి, బంధువులు రోదనతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఘటనపై తిరుచానూరు పీఎస్ లో కేసు నమోదు చేసి సేవ పంచనామా నిమిత్తం రూయా ఆస్పత్రికి తరలించామని శివప్రసాద్ తెలిపారు. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో పోలీసు శాఖ ద్వారా హెచ్చరికలు జారీచేసిన తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇకపై అయినా పోలీసుల విజ్ఞప్తులను ప్రజలు గుర్తించి తగ్గట్టుగా నడుచుకోవాలని సిఐ శివప్రసాద్ సూచించారు.

➡️