2వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం‘ పాదయాత్ర

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ రెండో రోజు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో ఈ పాదయాత్ర ఈరోజు 29వ డివిజన్‌ నుండి కొనసాగుతోంది. ” దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంచించిన బిజెపి-వైసిపిలను గద్దె దించండి.. నిరంకుశ బిజెపితో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించండి.. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం, వామపక్షాలను బలపరచండి..” నినాదంతో వారం రోజులపాటు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిపిఎం ‘జన శంఖారావం’ పాదయాత్ర కొనసాగనుంది. గురువారం ఉదయం విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో పాదయాత్ర ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

 

 

 

➡️