ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం సఅష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించుకోవడంతో పాటు మంగళవారం రాత్రి వీచిన గాలివానకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 18 విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా మండపేట నుంచి ఏడిద రోడ్డులో సమీపంలో సుమారుగా 80 ఏళ్ల నాటి చెట్టు విరిగిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరం ఏర్పడింది. గత రాత్రి నుంచి స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటికి ఆటంకం ఏర్పడిందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.