తిరుపతిలో గుండెపోటుతో క్రికెట్‌ అభిమాని మృతి

Nov 20,2023 16:10

ప్రజాశక్తి-తిరుపతిరూరల్‌ : ఇండియా -ఆస్ట్రేలియా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిందని ఓ క్రికెట్‌ అభిమానితో మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి 9 గంటలకి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్‌ మండలం దుర్గ సముద్రం చెందిన జ్యోతిష్‌ కుమార్‌ యాదవ్‌ (35) క్రికెట్‌ అభిమాని.. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా బెంగళూరులో పని చేస్తున్నాడు.. దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు. నిన్న జరిగిన వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ టీవీలో తిలకిస్తూ ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు తిరుపతి రూయాస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపాడు.

  • తుడా ఛైర్మెన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి నివాళి

ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్స్‌లో ఇండియా ఓటమిని జీర్ణించుకోలేని క్రికెట్‌ అభిమాని జ్యోతి కుమార్‌ యాదవ్‌ మతి చెందడం పట్ల తుడా ఛైర్మెన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి కుమార్‌ యాదవ్‌ నివాసం వద్దకు చేరుకున్న మోహిత్‌ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఓదార్చారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

➡️