కోర్టు తీర్పు వైసీపీకి చంపపెట్టు

Feb 17,2024 00:02

ప్రజాశక్తి – చీరాల
రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు అనుమతివ్వడం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టిడిపి ఇంచార్జ్ మద్దులూరి మాలకొండయ్య తనయుడు గౌరీ అమర్నాథ్ అన్నారు. సినిమాకు కోర్టు అనుమతి ఇవ్వటంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటేనే సిఎంకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. రైతులఫై తీసిన సినిమాను అడ్డుకునే దీన స్థితికి దిగజారిన ప్రభుత్వం అన్నారు. సినిమాతో అమరావతిలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన దారుణాలు వెలుగులోకి వస్తాయనే భయం పట్టుకుందని అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను, రాజధాని నిర్మాణాన్ని, రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసిన జగన్ 34వేల మంది రైతుల త్యాగాలకు వాస్తవరూపం రాజధాని సినిమా అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఎపిని నిలకబెట్టిన ఘనత జగన్ దేనని మండిపడ్డారు. సమావేశంలో బీసీ సెల్ అధ్యక్షులు కౌతరపు జనార్ధన్, కొమ్మనబోయిన రజిని, గంజి పురుషోత్తం, ధోని కనకరాజు, అనపర్తి రత్నబాబు, ఎరిపల్లి అప్పారావు, రసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️