- ఒక్క రోజే 841 మందికి కరోనా
ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 841 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు భారత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి. అవి కేరళ, కర్ణాటక, బీహార్ నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల సంఖ్య 4,309 లకు చేరుకుంది. కాగా గత 24 గంటల్లో నమోదైన కేసులు 7 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.