ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Dec 8,2023 11:01 #Continue, #floods, #Prakasam Barrage

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి గురువారం ఉదయం వరకు 30 వేల క్యూసెక్కులు రాగా రాత్రి ఏడు గంటలకు తొమ్మిది వేల క్యూసెక్కులకు ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటినిల్వ 3.07 టిఎంసిలు ఉన్నాయి. తొమ్మిది వేల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల, నాగార్జున సాగర్‌కు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతలకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున వస్తోంది. సాగర్‌ జలాశయానికి 4868 క్యూసెక్కులు వస్తున్నాయి.

➡️