నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభం 

Mar 14,2024 12:45 #Annamayya district

భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి
ప్రజాశక్తి – బి.కొత్తకోట : తంబళ్లపల్లి శాసనసభ్యులు శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మండలంలోని 3 కోట్ల 2 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గట్టు గ్రామం దిమ్మమీదపల్లి, ఇందిరమ్మ కాలనీ నందు నిర్మించునున్న 33/11 కేవీ కరెంట్ సబ్ స్టేషన్లకు భూమిపూజ నిర్వహించారు. అలాగే పేటీఎం మండలంలో చెన్డ్రాయినపల్లి,నందు రెండు కరెంట్ సబ్ స్టేషన్లుకు భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్ అహ్మద్, విద్యుత్ శాఖ డీఈ యుగంధర్,ఏఈ గిరిధర్,వైసీపీ మండల కన్వీనర్ ప్రదీప్ రెడ్డి,వైసిపి టౌన్ కన్వీనర్ సిఆర్ చిన్నికృష్ణ,మండల జేసీస్ కన్వీనర్ రెడ్డి హరి,సచివాలయ కన్వీనర్లు శెట్టిపల్లి రమేష్ రెడ్డి, గుమ్మడికాయల చాంద్ భాషా, జె.ఎన్.పి శ్రీనివాసులు,అంజమ్మ, ఎస్ఎస్ ఫయాజ్ సర్పంచులు గుడిపల్లి రఘు, వేములేటి కోట సర్పంచ్ రవి,ఎంపీటీసీలు రామసుబ్బారెడ్డి, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్ బాషా, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కంచి బలరాం రెడ్డి, వైసిపి నాయకులు నరసింహనాయుడు,ఎంవి కృష్ణయ్య,బసిరెడ్డి,సద్దాం,జయ, సాయి తదితరులు పాల్గొన్నారు.

➡️