రాజ్యాంగంపై అవగాహన సదస్సు

Mar 1,2024 17:18 #Kurnool

ప్రజాశక్తి-కర్నూల్ : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రస్తుత సమాజంలో వున్న రాజ్యాంగం పై అవగాహన సదస్సును నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక సంస్తాపకులు డా.బ్రహ్మా రెడ్డి వెన్నపూస గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా రాజ్యాంగం అనేది సర్వోతృష్ట చట్టం అని పేర్కొన్నారు. భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగం ద్వారానే వచ్చిందని, 1950 జనవరి 26 న రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక , ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది అని తెలియచేశారు. మన దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి రాజ్యాంగ అమలు ఎంత వరకు దోహద పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీతం విద్యాసంస్థల డైరక్టర్ శ్రీ డాక్టర్ మజ్జి శశి భూషణ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, ఇ .సి. ఇ విభాగాధిపతి డాక్టర్ టి. డి.వి.ఎ.నాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ విద్యా కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎ.వి రాజశేఖర్ పాల్గొన్నారు.

➡️