- రెండు కేంద్రాలలో యం అర్ ఓ తనిఖీ
ప్రజాశక్తి – వి అర్ పురం : ప్రజాశక్తి పదవ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలను యం అర్ ఓ మౌలానా ఫాజిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యం అర్ ఓ అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు పోలీసు అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు ఇన్విజి లెటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. పరీక్షలు ఎక్కడా ఎటువంటి సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరగటం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం రెండు సెంటర్లు ఉండగా అట్టి సెంటర్లు వద్ద చేసిన ఏర్పాట్లు విద్యార్థులకు మంచినీరు వైద్య పరీక్షలు నిర్వహణ బాగుందని పేర్కొన్నారు.