మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం రంగంలోకి దిగి వాణిజ్య నౌకకాపాడేందుకు ఎయిర్క్రాఫ్ట్, యుద్ధ నౌకను పంపింది.. ఈ మేరకు భారత నేవీ శనివారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
డిసెంబర్ 14 రాత్రి సమయంలో, MV Ruen UK మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) పోర్టల్లో మేడే సందేశాన్ని పంపింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓడలోకి ఎక్కినట్లు సందేశం పేర్కొంది. దీనిపై భారత నావికాదళం వేగంగా స్పందించింది. నావల్ మారిటైమ్ అరేబియా సముద్రంలో గస్తీ తిరుగుతున్న పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ అడెన్లో విధులు నిర్వహిస్తున్న యాంటీ పైరసీ పెట్రోలింగ్ యుద్ధనౌకను అప్రమత్తం చేసినట్లు నేవీ తెలిపింది. హైజాక్కు గురైన ఓడలో 18 మంది సిబ్బంది ఉన్నారు. యుకె మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వారు నౌకపై నియంత్రణ కోల్పోయారని వెల్లడించారు. భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం మరియు ఒక యుద్ధనౌక రూయెన్ నౌకకు సహాయంగా అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం సోమాలియా తీరం వైపు పయనిస్తోంది. దాని పైన నావికాదళ విమానం ఎగురుతోంది. మరోవైపు, ఈ ఉదయం రోవెన్ నౌకను భారత యుద్ధ నౌక విజయవంతంగా అడ్డుకున్నట్లు నేవీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.
#IndianNavy's Mission Deployed platforms respond to #hijacking in the #ArabianSea#MayDay msg from Malta Flagged Vessel MV Ruen on @UK_MTO portal – boarding by unknown personnel
Indian Naval Maritime Patrol Aircraft & warship on #AntiPiracy patrol immediately diverted@EUNAVFOR pic.twitter.com/mtXqjytSfF
— SpokespersonNavy (@indiannavy) December 16, 2023