చిన్నకోడూర్ (సిద్ధిపేట) : భార్య, పిల్లలను చంపి కలెక్టర్ గన్మేన్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేష్ మొదట భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. అనంతరం అతడు గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలోని చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మఅతులను నరేష్ భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రిగా గుర్తించారు. ఒకేసారి నలుగురు మఅతి చెందటంతో రామునిపట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.