వంద యూనిట్ల రక్తం సేకరణ

Jan 19,2024 00:19

ప్రజాశక్తి – బాపట్ల
విజయవాడ స్వరాజ్ మైదానంలో 125అడుగుల ఎత్తులో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ విజయోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు డిఎం అండ్‌ హెచ్‌ఒ ఎస్ విజయమ్మ తెలిపారు. మార్టూరు, రేపల్లె, బాపట్ల అంబేద్కర్ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు నియోజకవర్గ కేంద్రాల్లో వంద యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టిబి అధికారి సివి రమాదేవి, జిల్లా ఆసుప్రతుల సమన్వయ అధికారి డాక్టర్ శేషుకుమార్, జిల్లా న్యూక్లియర్ మెడికల్ ఆఫీసర్ షేక్ మొహమ్మద్ సాధిక్, జిల్లా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ సయ్యద్ జానీభాషా, బాపట్ల ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ మహేష్, చీరాల ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రాజ సిలువన్, సిబ్బంది, డిఎస్ఒ మార్గరేట్ పాల్గొన్నారు.

➡️