31 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత : జాయింట్ కలెక్టర్

Mar 28,2024 17:05 #close, #Krishna district, #RBK Centres

ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : 2023-24 ఖరీఫ్ పంట కాలంలో కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55,562 మంది రైతుల నుండి రు.1070.07 కోట్ల విలువైన 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెలాఖరు వరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈనెల 31వ తేదీ నాటికి వాటిని మూసివేయడం జరుగుతుందని తెలిపారు.కావున జిల్లాలోని రైతులందరూ తాము పండించిన ధాన్యం ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించవచ్చని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు.

➡️