ప్రజాశక్తి-పాలకొల్లు : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం 4395 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులు 9 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పట్నంలో బిఆర్ ఎంబి హైస్కూల్, ఎంఎంకె హైస్కూల్, మున్సిపల్ గర్ల్స్ స్కూల్లో 300 చొప్పున విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే పోలీసులు ఎన్నికల డ్యూటీలో ఉండటంతో ప్రతి కేంద్రం వద్ద పోలీసులను నియమించడం పట్టణ పోలీసులకు తలనొప్పిగా మారింది.