చీరాల సీటు సిఎంకు గిఫ్ట్‌గా ఇస్తా

Mar 17,2024 00:44

ప్రజాశక్తి – చీరాల
సీఎం జగన్మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు అన్నారు. వైసీపీ అధిష్టానం తన పేరును ప్రకటించడంతో ఆయన అనుచరులు, నాయకులు, కార్యకర్తలు, రామకృష్ణ పురంలోని వైసిపి కార్యాలయం నుండి భారీ ర్యాలీ శనివారం నిర్వహించారు. స్థానిక గడియార స్థంభం సెంటర్‌కు చేరుకొని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రజలు అందరూ తనకు అండగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తనకు సహకరించి తనను గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. గతంలో అనేక మంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారాని చెబుతుంటే నవ్వుకునే వాడినని, ప్రచారాలు చేసిన వారే చివరకు నవ్వుల పాలయ్యారని అన్నారు. తమ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు, ప్రజలందరి సహకారంతోనే తనకు వైసిపి అభ్యర్థిగా అవకాశం వచ్చిందని అన్నారు. కావున తన గెలుపుకు అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల చేసిన బాబు పాల్గొన్నారు.

➡️