తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల : తిరుమల వేంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనం సమయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎపి హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్‌ రాయ్, తిరుపతి జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, తిరుపతి మాజీ ఎంపి గురుమూర్తి, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌, తెలంగాణ బిసి కమిషనర్‌ చైర్మన్‌ కృష్ణమోహన్‌ రావు వెళ్లి తిరుమలలో మొక్కులు చెల్లించుకున్నారు. వీరితోపాటు ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు హీరో రాజేంద్ర ప్రసాద్‌, తిరుపతి ఎస్పీ కఅష్ణకాంత్‌ పటేల్‌, తిరుపతి ఫారెస్ట్‌ డి ఎఫ్‌ ఓ సతీష్‌ కుమార్‌ ఉన్నారు. దర్శనానంతరం వీరిని ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

➡️