ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పై మద్దికేర మండల పరిధిలోని మదనంతపురం గ్రామంలో వైసిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వైఫై మొగ్గుచూపుడంతో బానసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … తెలంగాణలో నిరంకుశత్వ పాలన సాగిస్తున్న బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టడం అభినందనీయం అన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పుష్పావతి, రామచంద్ర, శ్రీనివాసులు, రామాంజనేయులు, శివయ్య, సోమాజి, మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప పాల్గొన్నారు.