కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి మంటల్లో కారు – తప్పిన ప్రాణాపాయం

తిరుపతి సిటీ : కారు అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగిన ఘటన బుధవారం వెంకటగిరి నుండి గూడూరు వైపు వచ్చే దారిలో జరిగింది. నలుగురు ప్రయాణీకులతో వెళుతున్న కారు వెంకటగిరి నుండి గూడూరు వైపు వచ్చే దారిలో తిప్పవరప్పాడు గ్రామ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకుపోయిన నలుగురిని స్థానికులు రక్షించి, బయటకు తేవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

➡️