ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

Mar 18,2024 11:59 #Konaseema

ప్రజాశక్తి మండపేట : మండపేట పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భాష్యం, బాలికోన్నత పాఠశాల, సెంటెన్స్, మండలంలోని తాపేశ్వరంలోని శ్రీ చైతన్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ద్వారపూడి, ఏడిద గ్రామాలలో ఉన్న బాలిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. ఈ ఏడాది మండపేట పట్టణ, మండలానికి సంబంధించి మొత్తం 1800 మంది పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో బాలురు 939 బాలికలు 861 మంది ఉన్నారన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 1101, ప్రైవేటు పాఠశాల నుంచి 789 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం 1543, తెలుగు మీడియం 257 మంది ఉన్నారు.

➡️