ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వినుకొండ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని బరంపేటకు చెందిన ఏడు కొండలు(55) రియల్ ఎస్టేట్లో పాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో దాదాపు రూ.25 లక్షలు వరకు అప్పులు చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడం అప్పులు తీర్చలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.