బస్సుల్లేక ప్రయాణికుల పాట్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా

బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు

ప్రజాశక్తి- పలాస

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలిలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభకు ప్రజలను తరలిం చేందుకు ఆర్‌టిసి బస్సులను వినియో గించారు. ముందస్తు సమాచారం ఇవ్వక పోవడంతో ప్రయాణికులు వేకువ జామున 4.30 గంటల నుంచే బస్‌ కాంప్లెక్స్‌ వద్ద బస్సుల కోసం వేచి ఉన్నారు. ఏడు గంటలు కావస్తున్నా బస్సులు రాకపోవడంతో ఆర్‌టిసి సర్వీసులు నిలిపివేశారని తెలిసింది. అనంతరం ప్రయివేటు ట్రావెల్స్‌, ఒడిశా బస్సులను ఆశ్రయించారు. జగన్‌ సిద్ధం సభకు ప్రజలను తరలించేందుకు పలాస, టెక్కలి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్‌టిసి బస్సులను వేశారు. కొత్తూరు : టెక్కలిలో సిఎం జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు జనాలను తరలిం చేందుకు ఆర్‌టిసి బస్సులను వేశారు. బస్సు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆటోలు కూడా ప్రజలను తరలించడానికి ఉపయో గించడంతో ప్రయాణికులు అవస్థలు వర్ణనా తీతం. వాహనాలు లేకపోవడంతో గం టల కొద్దీ ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో వేచి ఉండాల్సి వచ్చింది.

 

➡️