- చెన్నయ్-మైసూర్ దూరం తగ్గనుంది
- ప్రత్యేక రైల్వేట్రాక్కు భూసేకరణ
- పనులు చేపట్టేలా ఎల్అండ్ టి యత్నం
ప్రజాశక్తి -తిరుపతి టౌన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైల్వే పరంగా ఎంతో వెనకబడి ఉంది. జిల్లాల విభజన తరువాత ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్ రానుందనేది ఈ ప్రాంతవాసులకు శుభవార్తే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గాంధీనగర్ నుంచి ముంబాయికి బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్నాయి. ఇది దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అవుతుంది. అలాగే చెన్నై నుంచి మైసూర్కు బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై నుంచి బెంగళూరు వయా మైసూరు వెళ్లాలంటే సుమారు పది గంటలు సమయం పడుతుంది. బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తయితే చెన్నై నుంచి మైసూర్కు సుమారు రెండు నుంచి రెండున్నర గంట సమయం పడుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ నడపడానికి రైల్వే ఉన్నతాధికారులు ప్రణాళికను రచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇటు కర్ణాటక అటు తమిళనాడు సరిహద్దు కావడంతో ఇటు వ్యాపారంగా అటు విద్య, వైద్య ఎంతోమంది చిత్తూరు జిల్లా వాసులకు బుల్లెట్ ట్రైన్ రావడంతో ఎంతో సమయం కలిసి రానుంది. చెన్నై హార్డ్వేర్ రంగంలో అభివద్ధి చెందగా, మైసూరు సాఫ్ట్వేర్ రంగంలో అభివద్ధి చెందింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఎంతోమంది విద్య వైద్య పరంగాప్రయాణం సాగిస్తూ ఉంటారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఇబ్బందులు అన్ని ఎన్ని కావు. గత రైల్వే బడ్జెట్లో చెన్నై మైసూర్ మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు తయారు చేశారు. అందుకు అనుగుణంగా ఈ పనులు సాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ కు ప్రత్యేక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికను రచిస్తున్నారు. ఈ పనులు దక్కించుకోవడానికి ఎల్ అండ్ టి సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చెన్నై మైసూర్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు ఐదేళ్ల లోపు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుంది. బుల్లెట్ ట్రైన్ చిత్తూరు మీదుగా వెళ్లడం వల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మూడు రాష్ట్రాల మీదుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించేలా అధికారులు డీపీఆర్ రూపొందించారు. సాధారణంగా చైన్నె నుంచి మైసూర్కు రైలులో వెళ్లాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ ట్రైన్కు చిత్తూరులో స్టాపింగ్ ఇవ్వడంతోbullet జిల్లావాసులకు సైతం సేవలందించనుంది.
చిత్తూరు స్టాపింగ్ మీదుగా…
జిల్లాలోని 41 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది. ఈ మేరకు 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్, ల్యాండ్ సర్వే పూర్తి చేసింది. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద చిత్తూరు స్టాపింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
రైతులకు ఐదు రెట్లు పరిహారం
ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అధికారులు భూసేకరణలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.. 41 గ్రామాలకు గాను 30 గ్రామాలకు చెందిన రైతులతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. వారి అభిప్రాయాలను పకడ్బందీగా సేకరిస్తున్నారు. భూములు ఇచ్చిన వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఏదో ఒకవిధంగా ఉద్యోగావకాశం కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. దీనిపై పలువురు రైతులు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం రెండు గంటల్లోనే చైన్నె నుంచి మైసూర్కు వెళ్లిపోవచ్చు. మొత్తం ఫ్లైఓవర్ మీద వేసిన ట్రాక్పైనే రైలు వెళుతుంది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాం. రైతులకు మార్కెట్ ధర కంటే ఐదు రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.