ఇండియా కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం

కుంచనపల్లి (గుంటూరు) : కుంచనపల్లి లో ఇండియా కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం సోమవారం ప్రారంభమైంది. సిపిఎం సీనియర్‌ తాడేపల్లి మండల నాయకులు కాట్రగడ్డ శివరామకృష్ణయ్య సిపిఎం జెండాను ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచార ప్రారంభానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు బి.ముత్యాలరావు, గ్రామంలోని ప్రధాన వీధులలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఇండియా కూటమి అభ్యర్థులైన గుంటూరు పార్లమెంటట్‌ కాంగ్రెస్‌ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌, సిపిఎం మంగళగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జొన్న శివశంకరరావు ప్రస్తుత ప్రచారం నిర్వహించి, ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి ఎస్‌ కే సలీం సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి, సిపిఎం కుంచనపల్లి గ్రామ శాఖ కార్యదర్శులు అమ్మిశెట్టి రంగారావు, కాజా వెంకటేశ్వరరావు, సిపిఎం తాడేపల్లి పట్టణ నాయకులు బి శివారెడ్డి, బి దశరధరామిరెడ్డి, సిపిఎం తాడేపల్లి మండల నాయకులు పల్లె కృష్ణ, కంచర్ల సాంబశివరావు, సిపిఐ మంగళగిరి నియోజకవర్గం కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, ఎం డాంగే పాల్గొన్నారు.

➡️