నవ వధువు ఆత్మహత్య

Apr 23,2024 10:57 #Bride, #commits suicide

చంద్రుగొండ (భద్రాద్రి కొత్తగూడెం) : ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినప్పటికీ కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ మాచినేని రవి వివరాల మేరకు … మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి (23) ఇటీవల బీఎస్సీ పూర్తి చేసింది. అనంతరం ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. అందుకు తల్లి తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గతనెల 28న వివాహం జరిగింది. పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చిన దేవకి ఈ నెల 14న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి, అనంతరం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవకి సోమవారం తెల్లవారుజామున మఅతి చెందింది. ఆమెకు ఇంజినీరింగ్‌ చదివిన సోదరుడు కూడా ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️