మహారాష్ట్రలో పడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

Jan 24,2024 10:35 #Maharashtra
  • ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం

మహారాష్ట్ర : పడవ బోల్తా కొట్టి, ఆరుగురు మహిళలు గల్లంతైన విషాద ఘటన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్ గంగా నదిలో పడవ బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి. చాముర్సి తాలుక గణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలోఏరివేత వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగా పూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. 7 మంది వెళ్తుండగా ప్రమాదం జరిగిందట. అయితే… ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు పడవ నడుపుతున్న వ్యక్తి. ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. ఇందులో జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసింది రెస్క్యూ టీం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️