ప్రజాశక్తి మండపేట(అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ లో ప్రధానోపాధ్యాయులు జి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులకు రంగులపై అవగాహన కల్పించడంలో భాగంగా బ్లాక్ అండ్ వైట్ కలర్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. విద్యార్థులు ఫ్రీ ప్రైమరీ దశలోనే అన్ని కలర్స్ గుర్తించి అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యార్థులుకు అర్థమయ్యే విధంగా డే అండ్ నైట్ ను ఉదాహరణగా చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ తో పాటు ఎన్నో ఆకర్షణీయమైన వస్తువులను విద్యార్థులకు చూపిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. నెలలో ఒక కలర్ గురించి అవగాహన కొరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని రీజనల్ ఇంఛార్జి నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇంఛార్జి ప్రసన్న, ఉపాధ్యాయని ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.