దాక్షారామలో బంద్ సంపూర్ణం

Jan 31,2024 16:17 #Konaseema
bandh-in-daksharama

ప్రజాశక్తి-రామచంద్రపురం : ద్రాక్షారామ పివిఆర్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పిలుపుమేరకు బుధవారం జరిగిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ గల పివిఆర్ హైస్కూల్ రెండేళ్లుగా మూతపడటంతో పాటు కోట్లాది విలువైన ఆస్తులను యాజమాన్యం పైడా సత్యప్రసాద్ సొంత ఆస్తులుగా కబ్జా చేయడంతో నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. మొత్తం ద్రాక్షారామ వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలు అన్ని స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. దీంతో మెయిన్ రోడ్లు అన్ని నిర్మానుస్యంగా తయారయ్యాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ ప్రభావం కనిపించింది. పూర్వ విద్యార్థుల సంఘం పిలుపుమేరకు వ్యాపార సంస్థల యజమానులతో పాటు, ఆటో యూనియన్లు, వివిధ వ్యాపార సంస్థల యూనియన్లు నాయకులు బంద్ కు సంపూర్ణ మద్దతు పలికారు. ఏ విధమైన సంఘటనలు చోటుచేసుకోకుండా బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది.  సహకరించిన అందరికీ నాయకులు మాగాపు అమ్మిరాజు కృతజ్ఞతలు తెలిపారు.

➡️