జగనన్నకు ‘బాబే’ పెద్ద స్టార్‌ క్యాంపెయినర్‌

జగనన్నకు 'బాబే' పెద్ద స్టార్‌ క్యాంపెయినర్‌

విలేకరులతో మాట్లాడుతున్న ప్రకాష్‌రెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

వైసిపి అధినేత జగనన్నకు టిడిపి అధినేత చంద్రబాబే పెద్ద స్టార్‌ క్యాంపెయినర్‌ అని రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్తి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం అనంతపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘జగన్‌మోహ న్‌రెడ్డి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? అన్న చంద్రబాబు నోటిద్వారానే జగన్‌ 1.60 లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పిం చారు.. వారితోనే పింఛన్లు ఇప్పించమనండి’ అని చెప్పడం చూస్తుంటే ప్రజలందరూ చర్చించుకుంటున్నారన్నారు. చంద్రబాబు చర్యలను బట్టి చూస్తుం టే వాలంటీర్లను స్టార్‌ క్యాంపెయినర్‌ అన్నట్టుగా మార్చింది ఆయనే అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులను స్టార్‌ క్యాంపెయిన్లగా మార్చింది చంద్రబాబే అన్నారు. మొత్తం మీద జగనన్నకు అతిపెద్ద క్యాంపెనర్‌ చంద్రబాబునే అన్నారు. జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ జగనన్నకు క్యాంపియన్‌ చేస్తున్నారన్నారు. ఇక బిజెపితో జత కట్టడం చంద్రబాబు పతనానికి కారణమన్నారు. చంద్రబాబు ఓటమి భయం, అక్కసుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడనేది అర్థమవుతోందన్నారు. చంద్రబాబు తన ఓటమికి క్లియర్‌గా సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్లను పింఛన్లు పంపిణీ చేయకూడదని, వారి వద్ద ఉన్న మొబైళ్లు, ట్యాబ్‌లు స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది వాలం టీర్లు రాజీనామాలు చేశారన్నారు. వారందరూ ఇప్పుడు స్వచ్ఛందంగా జగన్‌ గెలుపు కోసం పని చేస్తామంటూ ముందుకు వచ్చారన్నారు. దీనికితో డు తాను అధికారంలోకి రాగానే వాలంటీర్ల నియామకాలపై తొలి సంతకం ఉంటుందని జగనన్న ఫ్రకటించడంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారన్నారు. జగనన్న తుపాను, క్రేజ్‌, హవాలో ‘కూటమి’ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎంపి, 14 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

➡️