ఆయేషా మీరా హత్య కేసు.. సీబీఐకి హైకోర్టు నోటీసులు

Dec 27,2023 11:15 #AP High Court

ప్రజాశక్తి-అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఇప్పటి వరకు జరిగిన దర్యాఫ్తు వివరాలను కోర్టుకు అందజేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. కేసు దర్యాఫ్తులో పురోగతి లేదంటూ ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. కాగా, 2007 డిసెంబర్ 27 న ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

➡️