అగ్రస్థానంలో మను బకర్‌

Apr 21,2024 21:36 #Paris Olympics, #Sports

న్యూఢిల్లీ: తుగ్లకాబాద్‌లోని డా.కర్ణి సింగ్‌ రేంజ్‌లో జరుగుతున్న ఒలింపిక్‌ షూటింగ్‌ పోటీల్లో బను బకర్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన స్పోర్ట్స్‌ పిస్టల్‌ గ్రూప్‌ విభాగంలో బను 585పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఈషాసింగ్‌ 581పాయింట్లు సాధించగా.. సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ బ్రార్‌ 577పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరారు. ఇక రిథమ్‌ సాంగ్వాన్‌ 566పాయింట్లతో ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇక పురుషుల 25మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ విభాగంలో అనిష్‌ భన్వాల్‌(582) గ్రూప్‌ టాపర్‌గా నిలువగా.. విజరు వీర్‌ సిద్ధూ(580), భవేశ్‌ షెకావత్‌(580), అంకుర్‌ గోయల్‌(573), ఆదర్ష్‌ సింగ్‌(571) ఆ తర్వాతి స్థానాలో నిలిచారు. సోమవారం ఫైనల్‌తోపాటు ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఖరారు కానున్నాయి.

➡️