రాజకీయ పబ్బం గడుపుకునేందుకే సంఘాలు ఏర్పాటు

Mar 19,2024 16:23 #Konaseema

ప్రజాశక్తి -మండపేట :  కొంతమంది వ్యక్తులు ఎమ్మార్పీఎస్ సంఘాలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎమ్మెస్పీ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ దూలి జయరాజు అన్నారు.
ఎమ్మార్పీఎస్ ను అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవారు ఎక్కువయ్యారని దూలి జయరాజు వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక మహాజన సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి నేదునూరి రాజేష్, ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డోకుబుర్ర రాజబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ చార్జి గాలింకి నాగేశ్వరరావు, టీడీపీ ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు మోరంపూడి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  జయరాజు  మాట్లాడుతూ ‘చంద్రబాబు హయాంలోనే మాదిగలకు మేలు జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగలకు 22 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేలాది మంది ఉన్నత చదువులకు ఆయన హయాంలోనే బాటలు వేసారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే మాదిగ జాతి అభివృద్ధి సాధించిందన్న విషయాన్ని మాదిగలంతా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి తమకు అనుకూలంగా తీర్పు వెలువరించడానికి దోహదం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా టీడీపీ జనసేన కూటమితోనే చేతులు కలిపారని ఈ నేపథ్యంలో మన మద్దతు కూడా తెలియజేస్తే మోడీని గౌరవించినట్టు అవుతుందన్నారు. ఈ సమావేశంలో షేక్ నబి, అనసూరి విజయ్ కుమార్ పాల్గొన్నారు.

 

➡️