ప్రజాశక్తి- రేగిడి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 15న రాజాంలో నిర్వహించనున్న ప్రజాగళం సభకు హాజరవుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. గురువారం రాజాం మండలంలోని శ్యాంపురం టిడిపి క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 15న సాయంత్రం రాజాంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారన్నారు. ఈ రోడ్ షో సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, నిరుద్యోగులు ప్రజలు వేల సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభ ఉత్తరాంధ్రాకు గుర్తింపు తెచ్చే విధంగా జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు దూబ ధర్మారావు, కిమిడి అశోక్ కుమార్, నారాయణరావు, మహేశ్వరరావు, శాసపు జనార్ధన, చల్ల భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.