ప్రజాశక్తి – రేపల్లె
ఎలాంటి చర్చ లేకుండా అజెండాలని 17అంశాలను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ కట్టా మంగ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతూ అజెండాలో 17 అంశాలను పొందుపర్చారు. ఈ అంశాలకు ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్ పర్మన్ గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, విశ్వనాథ గుప్తా, కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి, ఎఈ రోహిణి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.