హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ అథారిటీ లెటర్లకు దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. ఫారం 12ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆ ఫారంను నింపిన అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ పక్కనే ఉన్న పబ్లిసిటీ సెల్ కార్యాలయంలో ఈ నెల 12వ సాయంత్రం 5లోగా సమర్పించారు.
దరఖాస్తుతో పాటు ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్, అక్రిడేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలి. అంతేకాకుండా అభ్యర్థులు ఆన్లైన్లో ఓటర్ పోర్టల్ ద్వారా తమ ఎపిక్ నంబర్ను సరిచూసుకుని జతపరచాలని అధికారులు సూచించారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు సమర్పించిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.