యానిమేటర్లు విధిగా సమావేశాలు ఏర్పాటు చేయాలి

Mar 2,2024 23:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు
డ్వాక్రా యానిమేటర్లు తప్పనిసరిగా ప్రతినెల గ్రూపు సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మండల సమైక్య ఎపీఎం జి శ్రీమన్నారాయణ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం విఒఎలకు గ్రామైక సంఘ సభ్యులకు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల సమైక్య అధ్యక్షురాలు జాలాది ధనలక్ష్మి అధ్యక్ష వహించారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు సమావేశాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలను, సభ్యులు తీసుకున్న రుణాలపై చర్చించి అవగాహన కల్పించాలని అన్నారు. మండల సమైక్య ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం లేని ఆరోగ్యవంతమైన పంటలు పండించుకునేందుకు దోహదపడాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ పిల్లి అశోక్, సిసి బి శ్రీనివాసరావు, ఎంటి బాల, శివ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.

➡️