సూరంపేట స్కూల్ కు అదనపు భవనం 

Feb 15,2024 12:17 #srikakulam
An additional building to the school in Surampet

ప్రజాశక్తి – రణస్థలం : మండలంలోని పాతర్లపల్లి పంచాయతీ సూరంపేట గ్రామంలో ఎంపిపి స్కూల్ అదనపు భవనంను కొవ్వాడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిధులుతో రూ. 16లక్షలు వ్యయంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతులు మీదుగా గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవ్వాడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి,రణస్థలం మండలం ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జే.సి.యస్ ఇంచార్జ్ చిల్ల వెంకటరెడ్డి,పాతర్లపల్లి పంచాయతీ సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంతి అయ్య, లోలుగు కృష్ణ, ముఠా మేస్త్రి, స్కూల్ కమిటీ చైర్మన్ జగ్గురోతు చిన్నకృష్ణ,నాయకులు జగ్గురోతు అప్పలనాయుడు, జగ్గురోతు రామకృష్ణ,జగ్గురోతు శ్రీరాములు, జగ్గురోతు రమణ, గొర్లె అసిరినాయుడు,జగ్గురోతు శ్రీను,లంక తవుడు,పాతర్లపల్లి పంచాయతీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️