ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక మునిసిపాలిటీ మరియు రూరల్ మండల పరిధిలోని సుమారు 234 మంది తుఫాన్ బాధితుల కుటుంబాలకు శనివారం నిత్యావసర వస్తువుల పంపిణి కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. నగరి నియాజకవర్గంలోని పుత్తూరు మునిసిపాలిటీ మరియు రూరల్ మండల పరిధిలో తుఫాన్ వలన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అసవ్యస్థమై పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఇల్లు కోల్పోవడం వలన తీవ్రంగా నస్టపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర వస్తువులను అయన పంపిణి చేశారు. పుత్తూరు మునిసిపాలిటీ మరియు రూరల్ మండల పరిధిలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఒక లీటర్ నూనె మరియు ఒక కిలో కందిపప్పు వంతున 234 తుఫాన్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మునిసిపాలిటీ చైర్మన్ ఏ హరి. వై చైర్మన్లు డీ జయ ప్రకాష్.డి శంకర్. మండల తాసిల్దార్ పరమేశ్వర స్వామి. డిప్యూటీ తాసిల్దార్ విజయభాస్కర్. మరియు రూరల్ మండల అధ్యక్షులు మునివేలమ్మ. వైసిపి మునుస్వామి రెడ్డి. ప్రజా ప్రతినిధులు, మండల రెవిన్యూ అధికారులు, వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.