రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే అసలైన నివాళి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి అని పలువురు సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ జయంతిని ఆదివారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాత్రికేయులు ఘన నివాళి అర్పించారు. అట్టడుగువర్గాలు ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్రాలు బీఆర్ అంబేద్కర్ చలవేననీ, రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యతను పాత్రికేయులు తమ భుజాన వేసుకోవాలని నినదించారు. అనంతరం 200 మంది పేదలకు అన్నదానం చేశారు. సీనియర్ పాత్రికేయులు ఎంవీ రమణ, వలిపి శ్రీరాములు, వాటంబేటి రవి, బాలసుబ్రమణ్యం, వీసీ వెంకటయ్య, మల్లెంబాకం మునికష్ణా రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కామేష్, పీఆర్వో యాసిన్, హరిబాబు, మైదీన్, సూర్యకుమార్, కోటా చంద్రశేఖర్, పేటా శేఖర్, జీ.చంద్ర, చక్రపాణి, బాలు, చాన్ బేగం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.