సెలవుపెట్టి మరీ గంజాయి తరలించారు – ఎపి పోలీసులిద్దరు అరెస్ట్‌

బాచుపల్లి (తెలంగాణ) : హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఎపికి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఎపి ఎస్‌పి కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరిద్దరూ.. సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వాహనం నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️