నిన్న టిడిపిలోకి నేడు వైసిపిలోకి..

Apr 9,2024 21:05

ప్రజాశక్తి – రామభద్రపురం : మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో స్థానిక మండల వైసిపి కార్యాలయంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో వైసిపిలో చేరాయి. వారికి ఎమ్మెల్యే శంబంగి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం టిడిపి నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని అయితే తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, చేస్తున్న అభివృద్ధి పనులకు మెచ్చి, స్థానిక ఎమ్మెల్యే శంబంగి పనితీరును మెచ్చి ఆ పార్టీ వీడి స్వచ్ఛందంగా ఈ పార్టీలో చేరుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సరస్వతి, జిల్లా వైసిపి మహిళా విభాగం కార్యదర్శి అప్పికొండ నిర్మల, పెంకి శేఖర్‌ బాబు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ చింతల సింహాచలంనాయుడు, పిఎసియస్‌ అధ్యక్షుడు కిర్ల చంద్రశేఖర్‌, విశాఖ డెయిరీ అధ్యక్షులు చొక్కాపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️