- వైసిపి జాబితా ప్రకటనలో సిఎం జగన్
- మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచుతాం
- అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ధర్మాన, నందిగం సురేష్
ప్రజాశక్తి- కడప ప్రతినిధి/వేంపల్లె : వైసిపి అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. శనివారం ఇడుపుల పాయలో రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపి నందిగం సురేష్తు వైసిపి అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. అంతకుముందు జగనమోహన్రెడ్డితో పాటు వైసిపి నేతలు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం . ధర్మాన ప్రసాదరావు, సురేష్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ ఘాట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను పక్కన కూర్చో బెట్టుకుని అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థిత్వాలను తమతోనే ప్రకటింపజేశారని గుర్తు చేశారు. ఈసారీ తామే ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను వారు ప్రకటించారు. అనంతరం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించామని అన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో ఎస్సిలకు 33, ఎస్టిలకు 8, బిసిలకు 59 కేటాయించామని చెప్పారు. మొత్తం సీట్లతో వీరికి 50 శాతం ఇచ్చామని తెలిపారు. గతం కంటే 11 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. ఒక అనకాపల్లి లోక్సభ అభ్యర్థిని మాత్రం పెండింగ్లో ఉంచినట్లు చెప్పారు. మహిళలకు సముచిత స్థానం కల్పించామన్నారు. అయినా తనకు సంతృప్తి కలగడం లేదని, భవిష్యత్తులో వారి ప్రాతినిధ్యాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తామన్నారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం మరెవరికీ ఉండకపోవచ్చన్నారు. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కలిపి 22 స్థానాలను మహిళలకు కేటాయించినట్లు చెప్పారు. ఇది 12శాతమని తెలిపారు. అభ్యర్థులలో 77 శాతం మంది గ్రాడ్యుయేట్లు, ఆ పైన చదివినవారని తెలిపారు. మైనార్టీలకు గతంలో ఐదు స్థానాలిస్తే ప్రస్తుతం ఏడు స్థానాలకు పెంచినట్లు తెలిపారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో ఏదో రూపంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల కాలంలో కనీవిని ఎరుగని విధంగా విప్లవాత్మక పాలన అందించినట్లు తెలిపారు. 2.70 లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసినట్లు తెలిపారు. 2-3 నెలలో రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన అన్నారు. మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తామని,సామాజిక న్యాయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని చెప్పారు.
వైసిపి అసెంబ్లీ జాబితాలో సామాజిక సమీకరణలు..
2019లో ఎస్సి : 29,
ఎస్టి : 7,
బిసి : 41
2024లో
ఎస్సి : 29,
ఎస్టి : 7,
బిసి : 48,
2019లో
మహిళలు : 15
మైనార్టీలు : 5
2024లో
మహిళలు : 9
మైనార్టీలు : 7
వైసిపి ప్రకటించిన ఎంపి అభ్యర్థుల్లో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వారిలో 22 మంది డిగ్రీ ఆపైన చదివారు. ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు, ఒక ఛార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే..
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు
ఆమదాల వలస – తమ్మినేని సీతారాం
పాతపట్నం -రెడ్డి శాంతి
నరసన్న పేట – ధర్మాన క్రిష్ణదాస్
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
ఇచ్ఛాపురం – పిరియా విజయ
పలాస – డాపప సీదిరి అప్పలరాజు
రాజాం (ఎస్సీ) – డాక్టర్ తలే రాజేశ్
విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి
బొబ్బిలి- సంబంగి వెంకట చిన అప్పల నాయుడుగజపతి
నగరం-బొత్స అప్పల నర్సయ్య
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
నెల్లిమర్ల -బొడ్డు కొండ అప్పల నాయుడు
ఎచ్చెర్ల- గొర్లె కిరణ్కుమార్
గాజువాక – గుడివాడ అమర్నాథ్
విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్
విశాఖ ఉత్తర – కేకే రాజు
భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ
విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్
శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు
పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్రాజ్
పాయకరావుపేట (ఎస్సీ) – కంబాల జోగులు
చోడవరం – కరణం ధర్మశ్రీ
నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేశ్
అనకాపల్లి – మలసాల భరత్కుమార్
మాడుగుల – బూడి ముత్యాల నాయుడు
ఎలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
అరకు (ఎస్టీ) – రేగం మత్స్యలింగం
పాడేరు (ఎస్టీ) – మత్స్యరస విశ్వేశ్వరరాజు
రంపచోడవరం (ఎస్టీ) – నాగులపల్లి ధనలక్ష్మి
పార్వతీపురం (ఎస్సీ) – అలజంగి జోగారావు
కురుపాం (ఎస్టీ) – పాముల పుష్ప శ్రీవాణి
సాలూరు (ఎస్టీ) – పీడిక రాజన్న
దొరపాలకొండ (ఎస్టీ) – విశ్వరాయి కళావతి
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
జగ్గంపేట- తోట నరసింహం
తుని- దాడిశెట్టి రాజా
పిఠాపురం- వంగా గీత
కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి
కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
పెద్దాపురం- దావులూరి దొరబాబు
రాజోలు (ఎస్సీ) – గొల్లపల్లి సూర్యారావు
కొత్తపేట – చీర్ల జగ్గిరెడ్డి
ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీశ్ కుమార్
రామచంద్రపురం – పిల్లి సూర్య ప్రకాశ్
అమలాపురం (ఎస్సీ) – పినిపే విశ్వరూప్
పి.గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్
మండపేట – తోట త్రిమూర్తులు
అనపర్తి – డాపప సత్య సూర్యనారాయణ రెడ్డి
గోపాలపురం (ఎస్సీ) – తానేటి వనిత
రాజానగరం – జక్కంపూడి రాజా
నిడదవోలు – గెడ్డం శ్రీనివాసనాయుడు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్రామ్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ
కొవ్వూరు (ఎస్సీ) – తలారి వెంకటరావు
నరసాపురం – ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు
భీమవరం – గ్రంథి శ్రీనివాస్
ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ఉండి – పీవీఎల్ నరసింహరాజు
తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ
పాలకొల్లు – గూడాల శ్రీహరి గోపాలరావు
చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు
నూజివీడు – మేకా వెంకట ప్రతాప అప్పారావు
దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి
కైకలూరు – దూలం నాగేశ్వరరావు
పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
ఏలూరు – ఆళ్ల నాని
ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)
పామర్రు (ఎస్సీ) – కైలే అనిల్ కుమార్
అవనిగడ్డ – సింహాద్రి రమేశ్ బాబు
మచిలీపట్నం – పేర్ని కిట్టు
పెడన – ఉప్పల రమేశ్
గుడివాడ – కొడాలి నాని
గన్నవరం – వల్లభనేని వంశీ మోహన్
పెనమలూరు – జోగి రమేశ్
నందిగామ (ఎస్సీ) – మొండితోక జగన్మోహనరావు
తిరువూరు(ఎస్సీ) – స్వామిదాస్
విజయవాడ ఈస్ట్: దేవినేని అవినాశ్
విజయవాడ వెస్ట్: షేక్ అసిఫ్
విజయవాడ సెంట్రల: శ్రీనివాస్
జగ్గయ్యపేట: ఉదయభాను
మైలవరం: శరణాల తిరుపతి రావు
తాడికొండ: మేకతోటి సుచరిత
ప్రత్తిపాడు: బాలసాని కిరణ్కుమార్
తెనాలి: అన్నాబత్తుని శివకుమార్
పొన్నూరు: అంబటి మురళి
గుంటూరు వెస్ట్: విడదల రజని
మంగళగిరి: మురుగుడు లావణ్య
గుంటూరు ఈస్ట్: షేక్ నూర్ ఫతిమా
పెద్దకూరపాడు: నంబూరు శంకర్రావు
వినుకొండ:బొల్లా బ్రహ్మయ్యనాయుడు
సత్తెనపల్లి: అంబటి రాంబాబు
గురజాల: కాసు మహేశ్ రెడ్డి
చిలకలూరిపేట: కావేటి శివమనోహర్ నాయుడు
నర్సరావుపేట: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
రేపల్లె: రేవూరి గణేశ్
బాపట్ల: కోన రఘుపతి
వేమూరు: వరికూటి అశోక్ బాబు
సంతనూతలపాడు: మేరుగ నాగార్జున
అద్దంకి: పాణెం హనిమి రెడ్డి
పర్చూరు: ఎడం బాలాజీ
చీరాల: కరణం వెంకటేశ్
దర్శి: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
యర్రగొండపాలెం: తాటిపర్తి చంద్రశేఖర్
గిద్దలూరు: కుందూరు నాగార్జున రెడ్డి
ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి
కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్
మార్కాపురం: అన్నా రాంబాబు
కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్
కావలి: రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ: మహమ్మద్ ఖలీల్ అహ్మద్
నెల్లూరు రూరల్: ఆడాల ప్రభాకర్ రెడ్డి
ఉదయగిరి: మేకపాటి రాజగోపాల్ రెడ్డి
ఆత్మకూరు: మేకపాటి విక్రమ్ రెడ్డి
సర్వేపల్లి: కాకాని గోవర్థన్ రెడ్డి
గూడూరు: మేరిగ మురళీధర్
రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి
ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి
గుంతకల్లు – వై. వెంకటరామిరెడ్డి
తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
శింగనమల – మన్నెపాకుల వీరాంజినేయులు
అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి
కల్యాణదుర్గం – తలారి రంగయ్య
రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి
తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లె – నిసార్ అహ్మద్
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి
కోడూరు – కె.శ్రీనివాసులు
రాయచోటి – గడికోట శ్రీకాంత్రెడ్డి
నగరి – ఆర్కే రోజాగంగాధర
నెల్లూరు – కృపాలక్ష్మి
చిత్తూరు – ఎం. విజయానందరెడ్డి
పూతలపట్టు – డాక్టర్ సునీల్కుమార్
పలమనేరు – ఎన్.వెంకటేశ గౌడ
కుప్పం – కేజే భరత్
పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కర్నూలు – ఎండీ ఇంతియాజ్
పత్తికొండ – కంగాటి శ్రీదేవి
కోడుమూరు – ఆదిమూలపు సతీశ్ఎ
మ్మిగనూరు – బుట్టారేణుక
మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి
ఆదోని – వై.సాయి ప్రసాద్రెడ్డి
ఆలూరు – బి. విరూపాక్షి
ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రారెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు – డాక్టర్ దారా సుధీర్
పాణ్యం – కాటసాని రాంభూపాల్రెడ్డి
నంద్యాల – శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి
బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి
డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
మడకశిర – ఈర లక్కప్ప
హిందూపురం – టీఎన్. దీపిక
పెనుకొండ – కేవీ ఉష శ్రీ చరణ్
పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి
ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి
కదిరి – బీఎస్ మక్బూల్ అహ్మద్
సంఖ్య పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి పేరు సామాజిక వర్గం
1. శ్రీకాకుళం పేరాడ తిలక్ బిసి కళింగ
2. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ బిసి తూర్పు కాపు
3 విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మీ బిసి తూర్పు కాపు
4. అరకు చెట్టి తనూజ రాణి ఎస్టీ వాల్మీకి
5. కాకినాడ చెలమలశెట్టి సునీల్ ఓసీ కాపు
6.అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సి మాల
7. రాజమండ్రి డా. గూడురి శ్రీనివాసులు బిసి శెట్టి బలిజ
8. నర్సాపురం గూడూరి ఉమా బాల బిసి శెట్టి బలిజ
9. ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ బిసి యాదవ
10. మచిలీపట్నం డా. సింహాద్రి చంద్రశేఖర్రావు ఓసీ కాపు
11 విజయవాడ కేశినేని శ్రీనివాస (నాని) ఓసీ కమ్మ
12 గుంటూరు కిలారి వెంకట రోశయ్య ఓసీ కాపు
13 నర్సరావుపేట డా. పి. అనిల్ కుమార్ యాదవ్ బిసి యాదవ
14 బాపట్ల నందిగాం సురేష్ బాబు ఎస్సి మాదిగ
15 ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ రెడ్డి
16 నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి ఓసీ రెడ్డి
17 తిరుపతి మద్దిల గురుమూర్తి ఎస్సీ మాల
18 చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ మాల
19 రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ రెడ్డి
20 కడప వైఎస్ అవినాష్రెడ్డి ఓసీ రెడ్డి
21 కర్నూలు బివై రామయ్య బిసి బోయ
22 నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి ఓసీ రెడ్డి
23 హిందూపుర్ జోలదరసి శాంత బిసి బోయ
24 అనంతపురం మాలగుండ్ల శంకర నారాయణ బిసి కురుబ
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు 200 సీట్లకు గాను 100 స్థానాలు కేటాయించారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయింపు.
ఎంపీల విద్యార్థత..
25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే.
ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు.
25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు.
ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్.
ఎమ్మెల్యేల విద్యార్హత..
175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు.
77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు.
2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు.
34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు
ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు.