ఉరవకొండ : వైసిపి నేతలు ఉరవకొండను దోచేస్తున్నారని.. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఉరవకొండ శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ … వైసిపి ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ పేరుతో సుమారు 17 వేల ఎకరాలు సేకరించారని.. కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా ? అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో వందల కిలోమీటర్ల రోడ్లు వచ్చాయన్నారు. పయ్యావుల.. ఉరవకొండకు మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించారని చెప్పారు. జగన్ వచ్చాక ఇక్కడ పది శాతం పనులు జరగలేదని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తున్నారన్నారు. నకిలీ ఆధార్ కార్డులు.. పత్రాలతో భూములు కాజేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. 80 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారని.. కనీసం 8 ఎకరాలకు సాగు నీరు ఇచ్చారా ? అని లోకేశ్ ప్రశ్నించారు.