నర్సరావుపేట ఎంపి రాజీనామా

Jan 24,2024 08:05 #resigns, #ycp mp

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: తన పదవికి, వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మంగళవారం ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీ అంశంపై తన సీటు విషయంలో గత కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొన్నట్లు, నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఏ పార్టీలో చేరేదీ, తన భవిష్యత్తు కార్యాచరణ గురించి మాత్రం ఆయన స్పందించకుండా వేగంగా కారు ఎక్కివెళ్లిపోయారు. శ్రీకృష్ణదేవరాయులుని ఈసారి గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేయాలని వైసిపి అధిష్టానం కోరగా అందుకు ఆయన నిరాకరించారు. పలువురు ఎమ్మెల్యేలు నచ్చజెప్పినా వైసిపి అధిష్టానం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

➡️